Sunday 22 July 2012

మా మాట!

ఓంప్రకాశ్ ప్రచురణాలయం!

పేరులో పేర్కొన్నట్టుగానే ఇదో ప్రచురణ సంస్థ. మచిలీపట్టణం లో మా నాన్న గారు వడ్డి చంద్ర శేఖర రావు, దీనిని 1968లో  మొదలు పెట్టారు. తొలి యత్నంగా బాలకవి వడ్డి కృష్ణ మూర్తి రాసిన 'పుష్పాభిలాష' పుస్తకాన్ని వెలువర్చారు. రెండో పుస్తకం 'నవ కవిత'! ఇది ఓ కవితా కదంబం!! పలువురు కవుల కవితలను ఇందులో పొందు పరిచారు. ఇక మూడవది 'విజ్ఞాన జ్యోతి'. నాలుగవ పుస్తకం 'ఆంధ్రుల పోరాటం'. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియ చేస్తూ జార్జ్ ఫెర్నందేస్ చేసిన ప్రసంగం. ఇక ఐదవది డాక్టర్ వడ్డి విజయ సారధి రాసిన బాలల గేయాల పుస్తకం 'గుమ్మటాలు'.

ఇలా పలు పుస్తకాలు ఓంప్రకాశ్ ప్రచురణాలయం నుండి వెలువడినాయి. వాటి వివరాలను తెలియ చేయడమే ఈ బ్లాగ్ ఉద్దేశం. మీ సలహాలు, సూచనలు కోరుతూ....

భవదీయ
వడ్డి ఓంప్రకాశ్ నారాయణ
ఫోన్: 9666678197

No comments:

Post a Comment