Saturday 28 July 2012

'విజ్ఞాన జ్యోతి' మకుట రహిత శతక గ్రంధం

శ్రీ బి. శ్రీనివాస గాంధీ రాసిన  'విజ్ఞాన జ్యోతి' మకుట రహిత శతక గ్రంధాన్ని ఓంప్రకాశ్ ప్రచురణాలయం మూడవ పుస్తకం గా 1971 లో ప్రచురించింది. దీన్ని శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారికి అంకితమివ్వటం జరిగింది. కృతిభర్త పరిచయాన్ని చాలా చక్కగా రాశారు మా నాన్న గారు వడ్డి చంద్రశేఖర రావు! అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కాకాని వెంకట రత్నం గారి చేతుల మీదగా ఈ పుస్తకం ఆవిష్కృతమైంది!

నవకవిత! (కవితాకదంబం)

'పుష్పాభిలాష' తర్వాత, ఓంప్రకాశ్ ప్రచురణాలయం ప్రచురించిన రెండవ పుస్తకం 'నవకవిత'! దీనికి బాలకవి వడ్డి కృష్ణమూర్తి కదంబకర్తగా వ్యవహరించారు. మునగ వెంకటేశ్వర్లు, సుమనశ్రీ, శీలం రాజేశం, వడ్డి విజయసారధి, తెన్నెల ఎలీషా, జే.ఎస్.ఆర్.కే. ప్రసాదరావు, రెడ్డి రాఘవయ్య, పరిమి వెంకట సుబ్రహ్మణ్యం, చిట్టా రామకృష్ణారావు, ప్రత్తిపాటి బేబి సరోజిని, కాజ లక్ష్మి నారాయణ, గుత్తికొండ సుబ్బారావు తదితరుల కవితలు ఇందులో పొందుపరిచారు.
'

Sunday 22 July 2012

మా మాట!

ఓంప్రకాశ్ ప్రచురణాలయం!

పేరులో పేర్కొన్నట్టుగానే ఇదో ప్రచురణ సంస్థ. మచిలీపట్టణం లో మా నాన్న గారు వడ్డి చంద్ర శేఖర రావు, దీనిని 1968లో  మొదలు పెట్టారు. తొలి యత్నంగా బాలకవి వడ్డి కృష్ణ మూర్తి రాసిన 'పుష్పాభిలాష' పుస్తకాన్ని వెలువర్చారు. రెండో పుస్తకం 'నవ కవిత'! ఇది ఓ కవితా కదంబం!! పలువురు కవుల కవితలను ఇందులో పొందు పరిచారు. ఇక మూడవది 'విజ్ఞాన జ్యోతి'. నాలుగవ పుస్తకం 'ఆంధ్రుల పోరాటం'. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియ చేస్తూ జార్జ్ ఫెర్నందేస్ చేసిన ప్రసంగం. ఇక ఐదవది డాక్టర్ వడ్డి విజయ సారధి రాసిన బాలల గేయాల పుస్తకం 'గుమ్మటాలు'.

ఇలా పలు పుస్తకాలు ఓంప్రకాశ్ ప్రచురణాలయం నుండి వెలువడినాయి. వాటి వివరాలను తెలియ చేయడమే ఈ బ్లాగ్ ఉద్దేశం. మీ సలహాలు, సూచనలు కోరుతూ....

భవదీయ
వడ్డి ఓంప్రకాశ్ నారాయణ
ఫోన్: 9666678197