Saturday 4 August 2012

'గుమ్మటాలు' బాలల గీతాలు

'పుష్పాభిలాష', 'నవకవిత', విజ్ఞాన జ్యోతి', 'ఆంధ్రుల పోరాటం' గ్రంధాల తర్వాత ఓంప్రకాశ్ ప్రచురణాలయం నుండి వచ్చిన ఐదవ పుస్తకం 'గుమ్మటాలు'. ఈ బాలల గీతాల పుస్తకాన్ని డాక్టర్ వడ్డి విజయ సారధి రాశారు. ఈ గీతాలు ఆంధ్రజ్యోతి, కృష్ణాపత్రిక, జాగృతి, సాందీపని, బాల ప్రపంచం, పసిడిబాల, చుక్కాని తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి. బాల బంధు బి.వి. నరసింహారావు 'గుమ్మటాలు' పుస్తకానికి ముందు మాట రాశారు!



ఈ పుస్తకం లోని తొలి గేయం ఇలా సాగుతుంది...

నా పాట!

వ్రాసెద నే కవితలెన్నొ
పాడుకొనగ బాలలెల్ల
మెత్తనైన హృదులలో
హత్తుకొనే రీతిలో

భాషలోని భేషజాలు
బాట కడ్డు రాకుండా
కవితలోని కమ్మదనం
కాస్తైనా చెడకుండా

కాజాలదు నాపాలిట
వ్యాకరణము శృంఖలమ్ము
కాజాలదు నా ముందట
ఛందము ఫణిబంధము

పిల్లలెల్ల ప్రేమింపగ
పెద్దలెల్ల దీవింపగ
సరళమైన రీతి నడచి
సంతృప్తిని కలుగజేతు

వెన్నతోడ బెట్టదగిన
విద్య నేను నేర్పువాడ
ప్రతి బాలకు హృదినిండా
జాతీయత నేర్పువాడ.

ఇలా సాగిన ఆ కలం నుండి మరెన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు వచ్చాయి... వాటి గురించి మరో సారి!!